నేవీ అమరవీరులకు ఘన నివాళి

ABN , First Publish Date - 2020-12-05T05:18:45+05:30 IST

పాకిస్తాన్‌తో జరిగిన యుద్ధంలో ఘన విజయం సాధించి, అమర వీరులైన జవాన్లకు నేవీ డే సందర్భంగా తూర్పు నౌకాదళం అధికారులు శుక్రవారం ఘన నివాళులు అర్పించారు.

నేవీ అమరవీరులకు ఘన నివాళి
గౌరవ వందనంతో నివాళులర్పిస్తున్న నేవీ అధికారులు, సిబ్బంది

విశాఖపట్నం, డిసెంబరు 4(ఆంధ్రజ్యోతి): పాకిస్తాన్‌తో జరిగిన యుద్ధంలో ఘన విజయం సాధించి, అమర వీరులైన జవాన్లకు నేవీ డే సందర్భంగా తూర్పు నౌకాదళం అధికారులు శుక్రవారం ఘన నివాళులు అర్పించారు. ఆర్‌ కే బీచ్‌లో అమర వీరుల స్మృతి చిహ్నం వద్దకు తూర్పు నౌకాదళం చీఫ్‌ వైస్‌ అడ్మిరల్‌ అతుల్‌కుమార్‌ జైన్‌ పుష్పమాలలతో రాగా 50 మంది నేవీ సిబ్బంది గౌరవ వందనం సమర్పించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ వినయ్‌చంద్‌, పోలీస్‌ కమిషనర్‌ మనీశ్‌ కుమార్‌ సిన్హా, జీవీఎంసీ కమిషనర్‌ సృజన, నేవీ ఫౌండేషన్‌ చైర్మన్‌ వీకే నంబళ్ల  పాల్గొని అమరవీరులకు స్మత్యంజలి ఘటించారు.


Updated Date - 2020-12-05T05:18:45+05:30 IST