సిద్దూని రాఖీ సావంత్తో పోల్చిన ఆప్ నేత
ABN , First Publish Date - 2021-09-18T00:01:48+05:30 IST
నవజ్యోత్ సిద్దూ ‘పంజాబ్ రాజకీయాల్లో రాఖీ సావంత్’ లాంటి వాడు అంటూ ఘాటుగా స్పందించారు ఆప్ ఎమ్మెల్యే రాఘవ్ చద్దా. ఆయన కామెంట్కి కారణం, సిద్దూ తాజాగా పోస్ట్ చేసిన ఓ వీడియో. అందులో ఆయన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ని విమర్శించారు. వ్యవసాయ సంస్కరణల విషయంలో కేజ్రీని తప్పుబట్టారు సిద్దూ. దాంతో ఆప్ ఆయన మీద ఎదురుదాడి ప్రారంభించింది.
నవజ్యోత్ సిద్దూ ‘పంజాబ్ రాజకీయాల్లో రాఖీ సావంత్’ లాంటి వాడు అంటూ ఘాటుగా స్పందించారు ఆప్ ఎమ్మెల్యే రాఘవ్ చద్దా. ఆయన కామెంట్కి కారణం, సిద్దూ తాజాగా పోస్ట్ చేసిన ఓ వీడియో. అందులో ఆయన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ని విమర్శించారు. వ్యవసాయ సంస్కరణల విషయంలో కేజ్రీని తప్పుబట్టారు సిద్దూ. దాంతో ఆప్ ఆయన మీద ఎదురుదాడి ప్రారంభించింది.
‘‘పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్కు వ్యతిరేకంగా రోజూ మాట్లాడిన సిద్దూకి కాంగ్రెస్ హైకమాండ్ బాగా తలంటింది. అందుకే, కాస్త భిన్నంగా ఆయన ఇవాళ్ల అరవింద్ కేజ్రీవాల్ మీద పడ్డాడు’’ అన్నారు రాఘవ్ చద్దా. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్, అకాళీదళ్ మధ్య ప్రధాన పోటీ సాగనున్నప్పటికీ అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో సీట్లు సాధిస్తుందని అంచనాలు వినిపిస్తున్నాయి. దాంతో ఇప్పుడు హస్తానికి, చీపురుకు కూడా పడటం లేదు. ముందు ముందు ఈ రెండు పార్టీల మధ్య మరిన్ని మాటల తూటాలు పేలటం ఖాయంగానే భావించవచ్చు.