సూపర్ మార్కెట్ కు వెళ్లిన ఆటో డ్రైవరుకు కరోనా సోకింది...మృతి

ABN , First Publish Date - 2020-04-10T17:50:34+05:30 IST

సూపర్ మార్కెటుకు వెళ్లిన ఓ ఆటో డ్రైవరుకు కరోనా వైరస్ సోకడంతో అతను చికిత్స పొందుతూ శుక్రవారం మరణించిన ఘటన...

సూపర్ మార్కెట్ కు వెళ్లిన ఆటో డ్రైవరుకు కరోనా సోకింది...మృతి

ముంబై: సూపర్ మార్కెటుకు వెళ్లిన ఓ ఆటో డ్రైవరుకు కరోనా వైరస్ సోకడంతో అతను చికిత్స పొందుతూ శుక్రవారం మరణించిన ఘటన మహారాష్ట్రలోని ముంబై నగరంలో వెలుగుచూసింది. ఖర్గార్ ప్రాంతానికి చెందిన 35 ఏళ్ల ఆటో డ్రైవరు అక్కడి సూపర్ మార్కెటుకు వెళ్లి వచ్చాడు. అనంతరం ఆటోడ్రైవరు అనారోగ్యానికి గురవడంతో అతను తలోజా ప్రాంతంలో స్థానిక ఆసుపత్రిలో వైద్యుడి వద్ద చికిత్స పొందారు.తర్వాత అతనిలో కరోనా లక్షణాలు కనిపించడంతో అతన్ని పరీక్షించగా వైరస్ సోకిందని తేలింది. ఇతనికి కరోనాకు తోడు డెంగీ జ్వరం కూడా సోకింది. దీంతో ఇతన్ని ఎన్ఎంఎంసీ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆటో డ్రైవరు శుక్రవారం మరణించాడు. మృతుడి తల్లి, భార్య, కుమార్తెలను పరీక్షించగా వారికి కరోనా నెగిటివ్ అని రిపోర్టు వచ్చింది. ఖర్గార్ ప్రాంతానికి చెందిన ఆటోడ్రైవరు కరోనాతో మరణించడంతో అప్రమత్తమైన మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు సూపర్ మార్కెట్ తోపాటు, ఆసుపత్రి, ఇంటి ఆప్రాంతాన్ని శానిటైజ్ చేసి, అనుమానితులను క్వారంటైన్ చేశారు.  

Updated Date - 2020-04-10T17:50:34+05:30 IST