అలరించిన భక్తి సంగీత విభావరి
ABN , First Publish Date - 2021-04-22T06:08:50+05:30 IST
ఏలూరు బజార్ శ్రీ రామమందిరంలో శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా బుధవారం నిర్వహించిన భక్తి సంగీత విభావరి ప్రేక్షకులను అలరింపచేసింది.
గుంటూరు (సాంస్కృతికం), ఏప్రిల్ 21: ఏలూరు బజార్ శ్రీ రామమందిరంలో శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా బుధవారం నిర్వహించిన భక్తి సంగీత విభావరి ప్రేక్షకులను అలరింపచేసింది. గాయకులు కేవీ సాయిబాబా శర్మ, ఆర్పీఎల్ నరసింహారావులు కార్యక్రమంలో అన్నమాచార్య, త్యాగారాజ విరచిత పలు కీర్తనలను శ్రావ్యంగా ఆలపించారు. కీబోర్డుపై రామకృష్ణ, తబల, డోలక్ఫై సాయి అభిరామ్ వాద్యసహకారం అందించారు.