ఆసీస్‌ టూర్‌కు సైనీ!

ABN , First Publish Date - 2020-10-17T08:46:32+05:30 IST

ఈ ఏడాది చివర్లో జరిగే ఆస్ట్రేలియా పర్యటనకు యువ బౌలర్‌ నవదీప్‌ సైనీ భారత జట్టుకు ఎంపికవడం ఖాయంగా ...

ఆసీస్‌ టూర్‌కు సైనీ!

న్యూఢిల్లీ: ఈ ఏడాది చివర్లో జరిగే ఆస్ట్రేలియా పర్యటనకు యువ బౌలర్‌ నవదీప్‌ సైనీ భారత జట్టుకు ఎంపికవడం ఖాయంగా కనిపిస్తోంది. సీనియర్‌ పేసర్లు ఇషాంత్‌ శర్మ, భువనేశ్వర్‌తో పాటు ఆల్‌ రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా గాయాలతో ఇబ్బంది పడుతుండడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. గతేడాది లండన్‌లో వెన్నుముక శస్త్రచికిత్స చేయించుకొన్న హార్దిక్‌ ఆడిన ఏడు ఐపీఎల్‌ మ్యాచ్‌ల్లో బౌలింగ్‌ చేయలేదు. ఇప్పటికే గాయాలతో ఇషాంత్‌ (ఢిల్లీ క్యాపిటల్స్‌), భువనేశ్వర్‌ (సన్‌రైజర్స్‌) ఈ సీజన్‌ ఐపీఎల్‌కు దూరమయ్యారు. ఈ నేపథ్యంలో ఆసీ్‌సతో టెస్ట్‌ సిరీ్‌సలో మహ్మద్‌ షమి, జస్‌ప్రీత్‌ బుమ్రాతో పాటు సైనీని మూడో సీమర్‌గా తీసుకోనున్నట్టు బోర్డు వర్గాలు తెలిపాయి. ఈ ఐపీఎల్‌లో బెంగళూరు తరఫున సైనీ 8 మ్యాచ్‌ల్లో 8.20 సగటుతో 4 వికెట్లు తీశాడు. అతను టీమిండియాకు 5 వన్డేలు, 10 టీ20ల్లో ప్రాతినిధ్యం వహించాడు. 

Updated Date - 2020-10-17T08:46:32+05:30 IST