ప్రకృతి వ్యవసాయం లాభదాయకం

ABN , First Publish Date - 2021-04-11T04:39:45+05:30 IST

సేంద్రియ ఎరువుల ద్వారా చేసే ప్రకృతి వ్యవసాయం ఎంతో లాభదాయకమని జేవీవీ సీఏ రాంమోహన్‌ తెలిపారు.

ప్రకృతి వ్యవసాయం లాభదాయకం
కషాయాలను తయారు చేస్తున్న ప్రకృతి వ్యవసాయాధికారులు

సుండుపల్లె, ఏప్రిల్‌10:  సేంద్రియ ఎరువుల ద్వారా చేసే ప్రకృతి వ్యవసాయం ఎంతో లాభదాయకమని జేవీవీ సీఏ రాంమోహన్‌ తెలిపారు. శనివారం సుండుపల్లె గ్రామం వెంగమరాజుగారిపల్లెలో మహిళా గ్రామ సంఘ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయం ద్వారా ఘనజీవామృతం వంటి కషాయాల ఎరువులు తయారు చేసి పంటలు పండించడం ద్వారా తాజా కూరగాయలతో పాటు భూమి సారవంతం పెరిగి రైతులకు మంచి లాభాలు వస్తాయని వివరించారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా పంటలు పండించడంతో  ఖర్చులు తగ్గి భూమిలో పోషక విలువలు పెరుగుతాయన్నారు. ప్రస్తుతం ప్రతి ఒక్కరూ ప్రకృతి వ్యవసాయం వైపు మొగ్గు చూపుతున్నారని వివరించారు. అనంతరం ఘనజీవామృతం చేసే విధానాన్ని మహిళా రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో సీఆర్‌పీ వీరనాగయ్య, ఆంజనేయులు, ఐసీఆర్‌పీలు, మహిళా రైతులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-04-11T04:39:45+05:30 IST