రాహుల్కు నాటుకోడి కూరతో విందు
ABN , First Publish Date - 2021-01-25T12:12:39+05:30 IST
కరూర్ జిల్లాలో సోమవారం పర్యటించనున్న రాహుల్గాంధీకి నాటుకోడి కూరతో పాటు మాంసాహార వంటకాలు సిద్ధమవుతున్నాయి. కరూర్-మదురై జాతీయ రహదారిలో
చెన్నై/ఐసిఎఫ్ (ఆంధ్రజ్యోతి): కరూర్ జిల్లాలో సోమవారం పర్యటించనున్న రాహుల్గాంధీకి నాటుకోడి కూరతో పాటు మాంసాహార వంటకాలు సిద్ధమవుతున్నాయి. కరూర్-మదురై జాతీయ రహదారిలో ఉన్న మురుగన్ విలాస్ హోటల్లో ఆయనకు మధ్యాహ్నం భోజనం ఏర్పాటుచేశారు. ఆయనతో పాటు 100 మందికి భోజనం ఆర్డరు ఇచ్చారు. ఈ విషయమై కాంగ్రెస్ నిర్వాహకులు మాట్లాడుతూ, రాహుల్కు మధ్యాహ్న భోజనంలో మటన్ బిర్యానీ, నాటుకోడి కూర, నాటుకోడి గుడ్ల గ్రేవీ, అన్నం, కొబ్బరి కలపని చికెన్ కూర, మిరియాల రసం, పెరుగు, నాటు చక్కెర పప్పు పాయసం తదితరాలు ఏర్పాటు చేశామన్నారు. ఈ పదార్ధాలను ఆహార భద్రత శాఖ అధికారుల సమక్షంలో వండించ నున్నామన్నారు. ఈ విందులో రాహుల్తో పాటు 17 మంది మాత్రమే పాల్గొంటారని, మిగిలిన వారికి విలాస్ బయట బఫే భోజనం ఏర్పాటుచేసినట్లు వారు తెలిపారు.