చంటి అడ్డాలపై పోలీసులకు నట్టికుమార్ ఫిర్యాదు
ABN , First Publish Date - 2020-10-02T08:07:28+05:30 IST
‘ఐనా నువ్వంటే ఇష్టం’ సినిమా ఇద్దరు నిర్మాతల మధ్య వివాదం రేపుతోంది. సినిమా హక్కుల కోసం ఒప్పందం కుదుర్చుకొని డబ్బులు ఇవ్వకుండా విడుదలకు సన్నాహాలు చేస్తున్నారని దర్శకుడు,
బంజారాహిల్స్, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి): ‘ఐనా నువ్వంటే ఇష్టం’ సినిమా ఇద్దరు నిర్మాతల మధ్య వివాదం రేపుతోంది. సినిమా హక్కుల కోసం ఒప్పందం కుదుర్చుకొని డబ్బులు ఇవ్వకుండా విడుదలకు సన్నాహాలు చేస్తున్నారని దర్శకుడు, నిర్మాత చంటి అడ్డాల ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు నిర్మాత నట్టికుమార్పై కేసు నమోదు చేశారు.
తాజాగా చంటి అడ్డాల.. ఆ సినిమాను మరో ముగ్గురికి అమ్మి తనను మోసం చేశారంటూ నట్టికుమార్ గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాను ఒప్పందం కుదుర్చుకున్నది వాస్తవమేనని, అయితే అప్పటికే హక్కులను చంటి మరో ఇద్దరికి అమ్మినట్టు తెలిసిందని పేర్కొన్నారు.