ఫ్రెండ్లీ హౌస్కు నాట్స్ బోస్టన్ విభాగం విరాళం
ABN , First Publish Date - 2020-05-31T06:47:49+05:30 IST
అమెరికాలో కరోనా విళయతాండవం చేస్తుండటంతో అక్కడ నిరుపేదలను ఆదుకునేందుకు
- అన్నార్తుల ఆకలి తీర్చడమే లక్ష్యంగా సాయం
బోస్టన్: అమెరికాలో కరోనా విళయతాండవం చేస్తుండటంతో అక్కడ నిరుపేదలను ఆదుకునేందుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం(నాట్స్) తన వంతు సాయం చేసేందుకు ముమ్మరంగా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా నాట్స్ బోస్టన్ విభాగం స్థానికంగా పేద కుటుంబాల ఆకలి తీర్చే ఫ్రెండ్లీ హౌస్కు 1500 డాలర్లను విరాళంగా అందించింది. నాట్స్ బోస్టన్ చాప్టర్ సమన్వయకర్త శ్రీనివాస్ గొండి ఆధ్వర్యంలో 1500 డాలర్ల చెక్కును ఫ్రెండ్లీ హౌస్కు ఇవ్వడం జరిగింది. నాట్స్ ఇచ్చిన విరాళంతో ప్రస్తుతం 150 కుటుంబాలకు తాము సాయం చేసేందుకు అవకాశం దొరికిందని ఫ్రెండ్లీ హౌస్ సెంటర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గోర్డాన్ హార్గోవ్ తెలిపారు. బోస్టన్లో ఇలా సాయం అందించేందుకు ముందుకొచ్చిన తొలి భారతీయ సంస్థ నాట్స్ అని ఆయన అన్నారు. మానవతా దృక్పథంతో విరాళమిచ్చిన నాట్స్ సభ్యులను ఆయన ప్రశంసించారు.