జాతీయభావాన్ని పెంపొందించుకోవాలి
ABN , First Publish Date - 2022-08-13T04:18:11+05:30 IST
విద్యార్థి దశనుంచే ప్రతి ఒక్కరూ జాతీయ భావాన్ని పెంపొందించుకోవాలని జడ్పీచైర్మన్ లింగాల కమల్రాజ్ పిలుపునిచ్చారు.
వైరా, ఆగస్టు 12: విద్యార్థి దశనుంచే ప్రతి ఒక్కరూ జాతీయ భావాన్ని పెంపొందించుకోవాలని జడ్పీచైర్మన్ లింగాల కమల్రాజ్ పిలుపునిచ్చారు. వైరా మండలం రెబ్బవరంలో శుక్రవారం చర్చి నుంచి హైస్కూల్ విద్యార్థులు స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకొని జాతీయ నేతల వేషధారణతో జాతీయ జెండాలు చేబూని ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా పాల్గొన్న జడ్పీచైర్మన్ కమల్రాజ్ జాతీయ నేతల వేషధారణలో ఉన్న చిన్నారులను అభినందించారు. కార్యక్రమంలో సర్పంచ్ రామారావు, ప్రధానోపాధ్యాయుడు శివన్నారాయణ పాల్గొన్నారు.