4న నాగార్జున విశ్వవిద్యాలయంలో 'జాతీయ మహిళా పార్లమెంట్'
ABN , First Publish Date - 2022-03-02T20:49:15+05:30 IST
గుంటూరు నగరంలోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో 'జాతీయ
అమరావతి: గుంటూరు నగరంలోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో 'జాతీయ మహిళా పార్లమెంట్'ను ఈ నెల 4న నిర్వహిస్తున్నట్లు ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ తెలిపారు. సమావేశానికి మహిళా మంత్రులు, ఎమ్మెల్యేలు, పలు కార్పొరేషన్ల చైర్పర్సన్లు హాజరుకానున్నారని ఆమె పేర్కొన్నారు. మహిళా సాధికారత, బాలిక విద్య, వివాహ వయసు పెంపు, లింగసమానత్వం, మహిళా చట్టాల అమలు, చట్టాల్లో తేవాల్సిన మార్పులు, మహిళల ఆరోగ్యం, భద్రత, రక్షణ తదితర అంశాల ప్రధాన అజెండాగా మహిళా పార్లమెంటు చర్చించనున్నదని ఆమె పేర్కొన్నారు. అన్ని ప్రభుత్వ శాఖల నుంచి మహిళా ఉద్యోగులు, యూనివర్సిటీలు, కాలేజీలు, కస్తూర్బా విద్యాకేంద్రాలు, పారా, ఇతర ఎన్జీవోల నుంచి ప్రతినిధులు ఈ సమావేశానికి వస్తున్నారని ఆమె తెలిపారు.