ప్రజాస్వామ్య బలోపేతానికి జాతీయ ఓటరు అవగాహన పోటీలు

ABN , First Publish Date - 2022-02-11T01:47:10+05:30 IST

ప్రజాస్వామ్య బలోపేతానికి జాతీయ ఓటరు అవగాహన పోటీలను నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర

ప్రజాస్వామ్య బలోపేతానికి జాతీయ ఓటరు అవగాహన పోటీలు

అమరావతి: ప్రజాస్వామ్య బలోపేతానికి జాతీయ ఓటరు అవగాహన పోటీలను నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి కె.విజయానంద్ తెలిపారు. క్విజ్, వీడియో మేకింగ్, పోస్టర్ డిజైన్, సాంగ్, స్లోగన్ విభాగాల్లో పోటీలు ఉంటాయని ఆయన పేర్కొన్నారు. ఔత్సాహిక, వృత్తిపరమైన, సంస్థాగత వర్గాలు ఈ పోటీల్లో పాల్గొనవచ్చని ఆయన తెలిపారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ, స్పెషల్ మెన్షన్ విజేతలకు నగదు పురస్కారాలు ఉంటాయన్నారు. తమ ఎంట్రీలను మార్చి 15 లోపు voter-contest@eci.gov.in కు ఇ-మెయిల్ చేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రం నుంచి పెద్ద సంఖ్యలో పాల్గొనేలా జిల్లా ఎన్నికల అధికారులు కృషిచేయాలని ఆయన కోరారు. 

Updated Date - 2022-02-11T01:47:10+05:30 IST