ఫైనల్ చేరిన ఆంధ్ర
ABN , First Publish Date - 2021-11-25T08:02:10+05:30 IST
వికెట్కీపర్ అజయ్ కుమార్ (63 నాటౌట్), ఓపెనర్ టి.కృష్ణ (51) మెరుపు అర్ధ శతకాలతో సత్తా చాటడంతో అంధుల జాతీయ టీ20 ట్రోఫీలో ఆంధ్ర జట్టు ఫైనల్కు
- అంధుల జాతీయ టీ20
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): వికెట్కీపర్ అజయ్ కుమార్ (63 నాటౌట్), ఓపెనర్ టి.కృష్ణ (51) మెరుపు అర్ధ శతకాలతో సత్తా చాటడంతో అంధుల జాతీయ టీ20 ట్రోఫీలో ఆంధ్ర జట్టు ఫైనల్కు చేరింది. గురుగ్రామ్లోని డీడీఏ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో బుధవారం ముగిసిన సెమీస్ పోరులో ఆంధ్ర ఆరు వికెట్ల తేడాతో గెలిచింది. తొలుత హరియాణా 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 180 పరుగులు చేసింది. ఓపెనర్ దీపక్ మాలిక్ (98) అజేయ అర్ధశతకంతో దుమ్ములేపాడు. ఛేదనలో 17.4 ఓవర్లలోనే 4 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసి ఆంధ్ర విజయదుందుభి మోగించింది. జట్టు గెలుపులో కీలకపాత్ర పోషించిన అజయ్కు వరుసగా రెండోసారి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. గురువారం జరగనున్న ఫైనల్లో కర్ణాటకతో ఆంధ్ర అమీతుమీ తేల్చుకోనుంది.