8న దేశవ్యాప్త బంద్‌ను విజయవంతం చేయాలి

ABN , First Publish Date - 2020-12-06T05:37:38+05:30 IST

సామర్లకోట, డిసెంబరు 5: ఈనెల 8న జరిగే దేశవ్యాప్త బంద్‌ను విజయవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్‌ రైతుకూలీ సంఘం ప్రధాన కార్యదర్శి కర్నాకుల

8న దేశవ్యాప్త బంద్‌ను విజయవంతం చేయాలి
పి.వేమవరంలో ధర్నా చేస్తున్న దృశ్యం

రైతుకూలీ సంఘం ప్రధాన కార్యదర్శి కర్నాకుల వీరాంజనేయులు 

సామర్లకోట, డిసెంబరు 5: ఈనెల 8న జరిగే దేశవ్యాప్త బంద్‌ను విజయవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్‌ రైతుకూలీ సంఘం ప్రధాన కార్యదర్శి కర్నాకుల వీరాంజనేయులు డిమాండ్‌ చేశారు. రైతాంగం డిమాండ్లను తక్షణం అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ రైతుకూలీ సంఘం ఆధ్వర్యంలో శనివారం మండలంలోని పి.వేమవరంలో ధర్నా నిర్వహించగా ముఖ్యఅతిథిగా కర్నాకుల హాజరయ్యారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి బీ.రమేష్‌, కొండా దుర్గారావు, కె.నాగబూషణం, కె.వెంకటేశులు, కె.సతీష్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-12-06T05:37:38+05:30 IST