ఏ ఎన్నికలు వచ్చినా బీజేపీదే విజయం : లక్ష్మణ్‌

ABN , First Publish Date - 2021-01-22T15:52:24+05:30 IST

రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా బీజేపీదే విజయం అని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ అన్నారు. గురువారం రాత్రి బర్కత్‌పురలోని గ్రేటర్‌ ...

ఏ ఎన్నికలు వచ్చినా బీజేపీదే విజయం : లక్ష్మణ్‌

హైదరాబాద్/బర్కత్‌పుర(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా బీజేపీదే విజయం అని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ అన్నారు. గురువారం రాత్రి బర్కత్‌పురలోని గ్రేటర్‌ కార్యాలయంలో ఎమ్మెల్సీ ఎన్నికలపై సమావేశం నిర్వహించారు. బీజేపీ హైదరాబాద్‌ సెంట్రల్‌ జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ ఎన్‌.గౌతమ్‌రావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో లక్ష్మణ్‌ మాట్లాడుతూ త్వరలో జరగనున్న రెండు ఎమ్మెల్సీ పట్టభద్రుల నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థులు విజయం సాధిస్తారని, దీనిని అడ్డుకోవడానికి సీఎం కేసీఆర్‌ రకరకాల కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎన్‌.రాంచందర్‌రావు, నగర మాజీ అధ్యక్షుడు బి.వెంకటరెడ్డి, మాజీ ప్రధాన కార్యదర్శి అల్లూరి రామకృష్ణ, మాజీ డిప్యూటీ మేయర్‌ సుభా్‌షచందర్‌జీ, ఎడెల్లి అజయ్‌కుమార్‌, దీపక్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2021-01-22T15:52:24+05:30 IST