ఉక్కు ప్రైవేటీకరణపై జాతీయ ఉద్యమం

ABN , First Publish Date - 2021-07-25T07:49:04+05:30 IST

‘‘విశాఖపట్టణం ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరించడాన్ని వ్యతిరేకిస్తూ జాతీయ స్థాయిలో ఉద్యమిస్తాం.

ఉక్కు  ప్రైవేటీకరణపై జాతీయ ఉద్యమం

ప్రాణత్యాగాలకైనా సిద్ధంగా ఉన్నాం: పరిరక్షణ సమితి నేతలు

న్యూఢిల్లీ, జూలై 24(ఆంధ్రజ్యోతి): ‘‘విశాఖపట్టణం ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరించడాన్ని వ్యతిరేకిస్తూ జాతీయ స్థాయిలో ఉద్యమిస్తాం. ప్రైవేటీకరణను ఆపేందుకు ప్రాణత్యాగాలకైనా సిద్ధంగా ఉన్నాం’’ అని విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి నాయకులు ప్రకటించారు. శనివారం సమితి నాయకులు మంత్రి శ్రీనివాస్‌, డీ ఆదినారాయణ ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. ప్రైవేటీకరణ చేయవద్దని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సహా అనేక మంది నాయకులను కలసి విజ్ఞప్తి చేశామని అన్నారు. రూ.2 లక్షల కోట్ల విలువైన ప్లాంట్‌ను కేవలం రూ.30 వేల కోట్లకే ఎలా విక్రయిస్తారన్న ప్రశ్నకు ఆర్థిక మంత్రి ఏ సమాధానమూ చెప్పలేకపోయారన్నారు.

Updated Date - 2021-07-25T07:49:04+05:30 IST