పుల్వామా దాడి కేసులో ఉగ్రవాది ఇక్బాల్ అరెస్ట్
ABN , First Publish Date - 2020-07-03T04:44:19+05:30 IST
శ్రీనగర్: పుల్వామా దాడి కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ మరో ఉగ్రవాదిని అరెస్ట్ చేసింది. కేసులో కీలక నిందితుడైన జైష్ ఎ మహ్మద్ ఉగ్రవాది ఉమర్ ఫరూఖ్కు ఇవాళ అరెస్ట్ అయిన మహ్మద్ ఇక్బాల్ అన్ని ....
శ్రీనగర్: పుల్వామా దాడి కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ మరో ఉగ్రవాదిని అరెస్ట్ చేసింది. కేసులో కీలక నిందితుడైన జైష్ ఎ మహ్మద్ ఉగ్రవాది ఉమర్ ఫరూఖ్కు ఇవాళ అరెస్ట్ అయిన మహ్మద్ ఇక్బాల్ అన్ని విధాలా సహకారం అందించినట్లు తేల్చారు. 2019 ఫిబ్రవరి 14న సీఆర్పీఎఫ్ కాన్వాయ్పై భారీ పేలుడు జరిపి 40 మంది జవాన్లను పొట్టనపెట్టుకున్న కేసులో ఉమర్ ఫరూఖ్ ప్రధాన నిందితుడు. పాకిస్థాన్కు చెందిన ఉమర్ ఫరూఖ్కు స్థానికంగా అన్ని ఏర్పాట్లూ అందించిన ఇక్బాల్ జమ్మూకశ్మీర్లోని బద్గాం వాసి. ఇక్బాల్ అరెస్టుతో ఈ కేసులో ఇప్పటివరకూ అరెస్టైన వారి సంఖ్య ఆరుకు చేరింది.
25 సంవత్సరాల ఇక్బాల్ 2018లోనే మరో ఉగ్రవాద కేసుకు సంబంధించి ఎన్ఐఏ నిఘాలో ఉన్నాడు. జైలునుంచి బయటకు వచ్చాక కూడా జైష్ ఎ మహ్మద్ ఉగ్రవాద సంస్థతో అనుబంధం కొనసాగించాడు. దర్యాప్తు కొనసాగుతోంది. ఇక్బాల్ నుంచి ఉగ్రవాదులకు సంబంధించిన మరిన్ని వివరాలు రాబట్టేందుకు ఎన్ఐఏ అధికారులు యత్నిస్తున్నారు.