19 నుంచే జాతీయ హాకీ శిబిరం

ABN , First Publish Date - 2020-08-13T09:23:48+05:30 IST

ముందస్తు షెడ్యూల్‌ ప్రకారం ఈనెల 19 నుంచే జాతీయ పురుషుల, మహిళల జట్ల హాకీ శిబిరాలను నిర్వహించనున్నట్టు...

19 నుంచే జాతీయ హాకీ శిబిరం

బెంగళూరు: ముందస్తు షెడ్యూల్‌ ప్రకారం ఈనెల 19 నుంచే జాతీయ పురుషుల, మహిళల జట్ల హాకీ శిబిరాలను నిర్వహించనున్నట్టు స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (సాయ్‌) స్పష్టం చేసింది. ఆరుగురు ఆటగాళ్లకు కొవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో శిబిరాల నిర్వహణపై సందేహాలు రేకెత్తాయి. అయితే శిబిరం వాయిదా పడబోదని సాయ్‌ తెలిపింది. ఉభయ జట్ల కోచ్‌లు, కెప్టెన్లతో చర్చించామని, 14 రోజుల క్వారంటైన్‌ ముగియగానే మరోసారి కరోనా పరీక్షలు నిర్వహించి శిబిరానికి హాజరయ్యే వారి పేర్లను ఖరారు చేస్తామని పేర్కొంది. 

Updated Date - 2020-08-13T09:23:48+05:30 IST