నేషనల్ హైవే పనులు వేగవంతం చేయాలి
ABN , First Publish Date - 2021-10-27T04:57:46+05:30 IST
నగరపంచాయతీ పరిధిలో వేస్తున్న నేషనల్ హైవే రోడ్డు పనులను వేగవంతం చేయాలని ఎమ్మెల్యే డాక్టర్ సుధీర్రెడ్డి సూచించారు.
ఎర్రగుంట్ల, అక్టోబరు 26: నగరపంచాయతీ పరిధిలో వేస్తున్న నేషనల్ హైవే రోడ్డు పనులను వేగవంతం చేయాలని ఎమ్మెల్యే డాక్టర్ సుధీర్రెడ్డి సూచించారు. మంగళవారం ఆయన ఏపీజీబీ నుంచి నాలుగురోడ్ల వరకు నిర్మిస్తున్న డ్రైనేజీ పనులు, పైప్లైన్ పనులను పరిశీలించారు. రోడ్డు విస్తరణ పనులు త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. కొన్నిచోట్ల ఆక్రమణలు, ఇళ్ల తొలగింపుపై స్థానిక నాయకులతో చర్చించారు. వాటి విషయం ఒక కొలిక్కి వచ్చినట్లు సమాచారం. ఈ కార్యక్రమం లో నగరపంచాయతీ ఛైర్మన్ ఎం.హర్షవర్దన్రెడ్డి, ముద్దనూరు ఎంపీపీ ప్రదీ్పకుమార్రెడ్డి, కో ఆప్షన్ సభ్యులు, కౌన్సిలర్లు, వైసీపీ నాయకులు దాసరిసూర్యనారాణరెడ్డి, పెన్నా రషీద్, కోకోకోలా గౌస్, కేవీసుబ్బారెడ్డి, షర్ఫుద్దీన్, మగ్బుల్బాషా, రాజారెడ్డి, ఏఈ సందీప్, తదితరులు పాల్గొన్నారు.