గణనాథుడికి జాతీయ పతాకం అలంకరణ
ABN , First Publish Date - 2022-08-16T05:27:43+05:30 IST
లక్ష్మీగణపతి స్వామి ఆలయంలో స్వామివారికి సోమవారం జాతీయ జెండాతో అలంకరించి, ఎరుపు, తెలుపు, ఆకుపచ్చ రంగులుగల పుష్పాలతో అర్చనలు జరిపారు.
ఏలూరుకార్పొరేషన్, ఆగస్టు 15 : సత్రంపాడులోని లక్ష్మీగణపతి స్వామి ఆలయంలో స్వామివారికి సోమవారం జాతీయ జెండాతో అలంకరించి, ఎరుపు, తెలుపు, ఆకుపచ్చ రంగులుగల పుష్పాలతో అర్చనలు జరిపారు. ఆలయ అర్చకులు రెండుచింతల రాఘవేంద్రశర్మ భక్తులతో పూజలు చేయించారు.