కాంగ్రెస్తోనే దేశాభివృద్ధి
ABN , First Publish Date - 2022-08-15T05:13:00+05:30 IST
దేశ అభివృద్ధి, అభ్యున్నతి కాంగ్రెస్తోనే సాధ్యమని డీసీసీ అధ్య క్షురాలు బొడ్డేపల్లి సత్యవతి పేర్కొన్నారు.
డీసీసీ అధ్యక్షురాలు సత్యవతి
అరసవల్లి: దేశ అభివృద్ధి, అభ్యున్నతి కాంగ్రెస్తోనే సాధ్యమని డీసీసీ అధ్య క్షురాలు బొడ్డేపల్లి సత్యవతి పేర్కొన్నారు. ఆదివారం స్థానిక ఇందిరావిజ్ఞాన్ భవన్ నుంచి ఏడురోడ్ల జంక్షన్ వరకు ఆజాదీకా గౌరవ యాత్రను నిర్వహించా రు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈ దేశానికి స్వాతంత్య్రం తెచ్చింది, ప్రాజెక్టులు, ఐఐటీలు, పేద, బడుగు, బలహీన వర్గాలకు ఇళ్లు నిర్మించింది కాంగ్రెస్ పార్టీయేనని ప్రజలు గుర్తించాలన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ ఇంత పటిష్టంగా ఉందంటే అందుకు కారణం కాంగ్రెస్ అని అన్నారు. కానీ, నేటి ప్రభుత్వం వ్యవస్థలను నాశనం చేస్తోందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సెల్ కన్వీనర్ సనపల అన్నాజీరావు, డీసీసీ ఉపాధ్యక్షుడు డి.గోవిందమల్లిబాబు, ప్రధానకార్యదర్శి అంబటి కృష్ణారావు, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు రెల్ల సురేష్, జిల్లా సేవాదళ్ అధ్యక్షుడు పైడి నాగభూషణరావు, ఎస్సీ సెల్ నాయకులు కూరాకుల వెంకటరావు, బొత్స రమణ, యువజన కాంగ్రెస్ నాయ కులు లఖినేని సాయిరాం, అంబటి దాలినాయుడు, తదితరులు పాల్గొన్నారు.