వ్యక్తిత్వ నైపుణ్యాలపై జాతీయ సదస్సు
ABN , First Publish Date - 2021-04-21T05:41:20+05:30 IST
వ్యక్తిత్వ నైపుణ్యాలు, ఆధునీక ప్రపంచంలో గల అవకాశాలపై నిర్వహించిన వెబినార్లో బాన్సువాడ ఎస్ఆర్ ఎన్కె ప్రభుత్వ అధ్యాపకులు పాల్గొన్నారు.
బాన్సువాడ, ఏప్రిల్ 20: వ్యక్తిత్వ నైపుణ్యాలు, ఆధునీక ప్రపంచంలో గల అవకాశాలపై నిర్వహించిన వెబినార్లో బాన్సువాడ ఎస్ఆర్ ఎన్కె ప్రభుత్వ అధ్యాపకులు పాల్గొన్నారు. మంగళవారం నిర్వహించిన వెబినార్ సుమారు రెండున్నర గంటలపాటు కొనసాగింది. కాగా ముఖ్యవక్తగా ఉస్మానియా యూనివర్సిటీ ఆంగ్ల ప్రొఫెసర్ డాక్టర్ అశోక్ పాల్గొన్నారు. ఎస్ఆర్ ఎన్కె కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ గంగాధర్, ఆంగ్ల అధ్యాపకుడు రాజశేఖర్, శంకర్, వెంకట్ రెడ్డి, గిరిధర్, గోపాల్ తదితరులు పాల్గొన్నారు. ఈ వెబినార్లో మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక వివిధ రాష్ర్టాల అధ్యాపకులు ఆన్లైన్లో పాల్గొన్నారు.