మీనాక్షి ఎనర్జీపై దివాలా ప్రక్రియకు ఓకే

ABN , First Publish Date - 2020-09-11T06:27:42+05:30 IST

మీనాక్షి ఎనర్జీ లిమిటెడ్‌ (ఎంఈఎల్‌)పై దివాలా ప్రక్రియకు ఎన్‌సీఎల్‌ఏటీ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. కంపెనీ ఈక్విటీలో మెజారిటీ వాటాదారైన ఎస్‌బీఐ క్యాప్స్‌కు దివాలా ప్రక్రియ చేపట్టే హక్కులేదన్న కంపెనీ వాదనను ముగ్గురు సభ్యుల ఎన్‌సీఎల్‌ఏటీ ధర్మాసనం తోసిపుచ్చింది...

మీనాక్షి ఎనర్జీపై దివాలా  ప్రక్రియకు ఓకే

న్యూఢిల్లీ: మీనాక్షి ఎనర్జీ లిమిటెడ్‌ (ఎంఈఎల్‌)పై దివాలా ప్రక్రియకు ఎన్‌సీఎల్‌ఏటీ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. కంపెనీ ఈక్విటీలో మెజారిటీ వాటాదారైన ఎస్‌బీఐ క్యాప్స్‌కు దివాలా ప్రక్రియ చేపట్టే హక్కులేదన్న కంపెనీ వాదనను ముగ్గురు సభ్యుల ఎన్‌సీఎల్‌ఏటీ ధర్మాసనం తోసిపుచ్చింది. దీనిపై హైదరాబాద్‌ ఎన్‌సీఎల్‌టీ ఇచ్చిన తీర్పును సమర్ధించింది. రుణానికి హమీగా ఉంచిన షేర్లను స్వాధీనం చేసుకున్నంత మాత్రాన ఎస్‌బీఐకి ఈ విషయంలో కంపెనీపై దివాలా ప్రక్రియ చేపట్టే అవకాశం పోదని ఎన్‌సీఎల్‌ఏటీ స్పష్టం చేసింది. నెల్లూరు జిల్లా కృష్ణపట్నం వద్ద 1,000 మెగావాట్ల సామర్ధ్యంతో కంపెనీ ఏర్పాటు చేసిన ధర్మల్‌ విద్యుత్‌ ప్లాంట్‌ రుణాల చెల్లింపుల్లో విఫలమవుడంతో ఎస్‌బీఐ దివాలా చర్యలకు ఉపక్రమించింది. 


Updated Date - 2020-09-11T06:27:42+05:30 IST