జాతీయ బ్యాడ్మింటన్‌ శిబిరం షురూ

ABN , First Publish Date - 2020-08-08T09:14:20+05:30 IST

క్రీడా కార్యకలాపాల పునరుద్ధరణకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో జాతీయ బ్యాడ్మింటన్‌ శిక్షణా శిబిరం మొదలైంది.

జాతీయ బ్యాడ్మింటన్‌ శిబిరం షురూ

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): క్రీడా కార్యకలాపాల పునరుద్ధరణకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో జాతీయ బ్యాడ్మింటన్‌ శిక్షణా శిబిరం మొదలైంది. గోపీచంద్‌ అకాడమీలో శుక్రవారం ట్రైనింగ్‌ క్యాంప్‌ను ప్రారంభించారు. పీవీ సింధు, సాయి ప్రణీత్‌తో పాటు డబుల్స్‌ ఏస్‌ సిక్కిరెడ్డి పాల్గొన్నారు. జాతీయ చీఫ్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌, ఇద్దరు విదేశీ కోచ్‌ల ఆధ్వర్యంలో షట్లర్లు తొలిరోజు సాధన చేశారు. కాగా.. పురుషుల డబుల్స్‌ స్టార్‌ జోడీ సాత్విక్‌ సాయిరాజ్‌, చిరాగ్‌ శెట్టి కొవిడ్‌ పరిస్థితుల నేపథ్యంలో ఇప్పట్లో శిక్షణ శిబిరానికి రాలేమని తెలిపారు. రెండువారాల తర్వాత అకాడమీలో ప్రాక్టీస్‌ చేసే విషయాన్ని పరిశీలిస్తామని సాత్విక్‌, చిరాగ్‌ పేర్కొన్నారు. ప్రస్తుతం వీరిద్దరూ తమ స్వస్థలాల్లో ఉన్నారు.


Updated Date - 2020-08-08T09:14:20+05:30 IST