శంషాబాద్ ఎయిర్పోర్టుకు జాతీయ అవార్డులు
ABN , First Publish Date - 2021-09-07T01:43:02+05:30 IST
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఇండస్ట్రీ (సీఐఐ), నేషనల్ లీడర్ మరియు ఎక్సలెంట్ ఎనర్జీ ఎఫీషియెంట్
శంషాబాద్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఇండస్ట్రీ (సీఐఐ), నేషనల్ లీడర్ మరియు ఎక్సలెంట్ ఎనర్జీ ఎఫీషియెంట్ యూనిట్-2021 అవార్డులను గెల్చుకుందని జీఎంఆర్ అధికారులు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గోద్రెజ్ గ్రీన్ బిజినెస్ సెంటర్ (జీబీసీ) ఆధ్వర్యంలో ఆగస్టు 24వ తేదీ నుంచి 27 వరకు నిర్వహించిన ఎనర్జీ ఎఫీషియెన్సీ సమ్మిట్, 20వ ఎడిషన్ వర్చువల్ కాన్ఫరెన్స్ అండ్ ఎక్స్పొజీషన్ ఆన్ ఎనర్జీ కార్యాక్రమాల సందర్భంగా ఈ అవార్డులను ప్రకటించారని పేర్కొన్నారు. ఈ అవార్డులను గెల్చుకోవడం ఇది వరుసగా ఐదోసారి అని జీఎంఆర్ అధికారులు తెలిపారు. గత నెల 27న గెయిల్ హెడ్ ఇంజినీర్ ప్రసన్నకుమార్ పోదార్, పీటీబీ ఇంజినీర్ విజయ్రాథోడ్ అవార్డులను అందుకున్నారని జీఎంఆర్ సీఈవో ప్రదీప్ ఫణీకర్ తెలిపారు. ప్రయాణికులకు ఉత్తమ సేవలు అందించడంతో పాటు ఇందన వనరులను సమర్ధవంతంగా ఉపయోగించుకోవాలనే తమ నిబద్దతకు ఈ అవార్డులు నిదర్శనమని పేర్కొన్నారు. ఈ అవార్డులను సొంతం చేసుకోవడం సంతోషంగా ఉందని చెప్పారు.