ఎన్ఎ్సఎ్స కోఆర్డినేటర్ జ్యోతికి జాతీయ అవార్డు
ABN , First Publish Date - 2022-09-25T05:24:52+05:30 IST
కోహెడ మండలం శనిగరం గ్రామానికి చెందిన ఎన్ఎ్సఎ్స ప్రోగ్రాం కోఆర్డినేటర్ సుంకరి జ్యోతి అందించిన సేవలకు జాతీయ అవార్డు పొందింది.
కోహెడ, సెప్టెంబరు 24 : కోహెడ మండలం శనిగరం గ్రామానికి చెందిన ఎన్ఎ్సఎ్స ప్రోగ్రాం కోఆర్డినేటర్ సుంకరి జ్యోతి అందించిన సేవలకు జాతీయ అవార్డు పొందింది. శనివారం ఎన్ఎ్సఎ్స డే సందర్భంగా ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి అవార్డు అందుకున్నది. సిల్వర్ మెడల్తో పాటు ప్రశంసాపత్రాన్ని పొందింది. ఈ సందర్భంగా ఆమె ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ యూనివర్సిటీ పరిధిలో 360 ఎన్ఎ్సఎ్స యూనిట్లు ఉన్నాయని, 36 వేల మంది వలంటీర్లు సేవా భావంతో పనిచేస్తున్నారన్నారు.