Mumbai: పాన్ మసాలా ప్రచార ప్రకటన నుంచి వైదొలగండి
ముంబై: బాలీవుడ్ ప్రముఖ నటుడు అమితాబ్బచ్చన్కు నేషనల్ యాంటీ టుబాకో ఆర్గనైజేషన్ సంచలన లేఖ రాసింది.అమితాబ్ బచ్చన్ పాన్ మసాలాను ప్రచారం చేసే ప్రకటన ప్రచారం నుంచి వైదొలగాలని జాతీయ పొగాకు వ్యతిరేక సంస్థ కోరింది.పొగాకు, పాన్ మసాలా వ్యసనం పౌరుల ఆరోగ్యాన్ని క్షీణిస్తుందని వైద్య పరిశోధనల్లో తేలిందని, అందువల్ల పాన్ మసాలాలను ప్రోత్సహించే ప్రకటనల ప్రచారం నుంచి వైదొలగాలని కోరుతూ నేషనల్ యాంటీ టుబాకో ఆర్గనైజేషన్ అధ్యక్షుడు శేఖర్ సల్కర్ అమితాబ్ కు లేఖ రాశారు.
‘‘అమితాబ్ హై ప్రొఫైల్ పల్స్ పోలియో ప్రచారానికి ప్రభుత్వ బ్రాండ్ అంబాసిడర్ అని, అతను వీలైనంత త్వరగా పాన్ మసాలా ప్రకటనల నుంచి తప్పుకోవాలి.పొగాకు వ్యసనం నుంచి యువత దూరంగా ఉండటానికి ఈ చర్య సహాయపడుతుంది’’ అని శేఖర్ సల్కర్ కోరారు.‘‘పాన్ కేన్సర్ కారకంగా పనిచేస్తోందని ఇటీవలి పరిశోధనలో తేలింది, తమలపాకులోని పదార్థాలు శరీరంలో కేన్సర్ కారకాలుగా మారి నోటి కేన్సర్కు దారితీస్తాయని తేలింది. ‘‘పాన్ మానవులకు కేన్సర్ కారకం అనే శాస్త్రీయ ఆధారాలను ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ కేన్సర్, ప్రపంచ ఆరోగ్య సంస్థలు నిర్దారించాయి’’అని బచ్చన్కు రాసిన లేఖలో సల్కర్ పేర్కొన్నారు.