జగన్‌ ప్రచార పిచ్చి పరాకాష్టకు చేరింది

ABN , First Publish Date - 2020-12-06T04:23:08+05:30 IST

పట్టణ పేదల కోసం గత ప్రభుత్వం నిర్మించిన 12లక్షల టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు ఇవ్వకుండా తాజాగా తన ప్రచార పిచ్చితో జగన్‌ ఇల్లు కావాలా.. చంద్రబాబు ఇళ్లు కావాలా అంటూ వాలంటరీల చేత సర్వే చేయించడం ముమ్మాటికి పేదల మనోభావాలను కించపరచటమేనని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి మహ్మద్‌ నసీర్‌ అన్నారు.

జగన్‌ ప్రచార పిచ్చి పరాకాష్టకు చేరింది
సచివాలయం ముందు ఆందోళన చేస్తున్న టీడీపీ నేతలు మహ్మద్‌ నసీర్‌ తదితరులు

మహ్మద్‌ నసీర్‌

గుంటూరు, డిసెంబరు 5(ఆంధ్రజ్యోతి): పట్టణ పేదల కోసం గత ప్రభుత్వం నిర్మించిన 12లక్షల టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు ఇవ్వకుండా తాజాగా తన ప్రచార పిచ్చితో జగన్‌ ఇల్లు కావాలా.. చంద్రబాబు ఇళ్లు కావాలా అంటూ వాలంటరీల చేత సర్వే చేయించడం ముమ్మాటికి పేదల మనోభావాలను కించపరచటమేనని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి మహ్మద్‌ నసీర్‌ అన్నారు. ఈ మేరకు శనివారం సంగడిగుంట సచివాలయం వద్ద పార్టీ శ్రేణులతో కలిసి నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నసీర్‌ మాట్లాడుతూ సీఎం జగన్‌ తన 18 నెలల పాలనలో ఒక్క ఇల్లు కట్టకుండా కట్టిన ఇళ్లను పూర్తి చేయకుండా చద్రబాబు హయాంలో కట్టిన టిడ్కో ఇళ్లకు స్టిక్కర్‌ అంటించుకొని  ప్రకటనలు ఇస్తున్నారని మండిపడ్డారు. జగన్‌రెడ్డి ఏమీ తన అక్రమ సంపాదనతో కట్టిన భవంతులు పేదలకు ఇవ్వటం లేదన్నారు. ఒక్క రూపాయి తీసుకోకుండా పుదలకు ఇళ్లు అందిచాల్సిందేనన్నారు. దీంతో పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకొని  లాలాపేట స్టేషన్‌కు తరలించారు. 


Updated Date - 2020-12-06T04:23:08+05:30 IST