వచ్చే వారంలోనే..నాసల్‌ టీకా ట్రయల్స్‌!

ABN , First Publish Date - 2021-03-04T07:10:16+05:30 IST

కరోనాపై పోరులో భాగంగా భారత్‌ బయోటెక్‌ సంస్థ అభివృద్ధి చేసిన నాసల్‌ (ముక్కు ద్వారా తీసుకునే) టీకా తొలి దశ పరీక్షలు..

వచ్చే వారంలోనే..నాసల్‌ టీకా ట్రయల్స్‌!

న్యూఢిల్లీ, మార్చి 3: కరోనాపై పోరులో భాగంగా భారత్‌ బయోటెక్‌ సంస్థ అభివృద్ధి చేసిన నాసల్‌ (ముక్కు ద్వారా తీసుకునే) టీకా తొలి దశ పరీక్షలు.. వచ్చే వారమే ప్రారంభం కానున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. హైదరాబాద్‌తోపాటు.. పట్నా, చెన్నై, నాగపూర్‌ నగరాల్లో ఈ ట్రయల్స్‌ జరగనున్నాయి. సెంట్రల్‌ ట్రెయిల్‌ రిజిస్ట్రీ ఆఫ్‌ ఇండియా (సీటీఆర్‌ఐ) ప్రకారం.. 175 మందిపై ఈ టీకా ట్రయల్స్‌ జరగనున్నాయి. ట్రయల్స్‌లో పాల్గొనేవారి ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. నాసల్‌ టీకా ఫేజ్‌ 1, ఫేజ్‌ 2 ట్రయల్స్‌ నిర్వహించడానికి కావాల్సిన అనుమతుల కోసం.. జనవరి 8న భారత్‌ బయోటెక్‌ భారత డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ను సంప్రదించింది. ఆ అభ్యర్థనను మంగళవారం (మార్చి 2న) పరిశీలించిన సబ్జెక్ట్‌ నిపుణుల కమిటీ.. ఫేజ్‌-1 ట్రయల్స్‌కు అనుమతించాల్సిందిగా సిఫారసు చేసింది.

Updated Date - 2021-03-04T07:10:16+05:30 IST