స్టన్నింగ్ ఫొటోలు పంపిన ఐఎస్ఎస్.. షేర్ చేసిన నాసా

ABN , First Publish Date - 2021-04-17T02:30:24+05:30 IST

అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (నాసా) గురువారం తన

స్టన్నింగ్ ఫొటోలు పంపిన ఐఎస్ఎస్.. షేర్ చేసిన నాసా

న్యూయార్క్: అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (నాసా) గురువారం తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫొటోలు ప్రపంచాన్ని అబ్బురపరుస్తున్నాయి. భూమిని అంతరిక్షం నుంచి తీసిన ఫొటోలే ఇవి. కానీ అవి నెటిజన్లను మెస్మరైజ్ చేస్తున్నాయి. అంతర్జాతీయ అంతరిక్షం కేంద్రంలోని వేంటేజ్ పాయింట్ నుంచి ఈ ఫొటోలను తీశారు. ఇందులోని ప్రకృతి దృశ్యాలు మైమరపిస్తున్నాయి.


 మానవ జీవితాలతో ముడిపిన భూమి, నీరు, గాలి, ఐస్ ఫొటోలు ఇవి. ‘‘మనం భూమ్మీద ఉన్నామా? అంతరిక్షంలో ఉన్నామా? అన్నది కాదు. మనం ఈ చిన్న నీలి గ్రహం ద్వారా ఏకీకృతం అయ్యాం. ఇది మనం సెలబ్రేట్ చేసుకోవాల్సిన విషయం’’ అని నాసా రాసుకొచ్చింది. ఈ అద్భుతమైన ఫొటోలను నాసా షేర్ చేసిన వెంటనే వైరల్ అయ్యాయి. మిలియన్ల కొద్దీ లైకులు, షేర్లు, కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.  

Updated Date - 2021-04-17T02:30:24+05:30 IST