నరసరావుపేటలో లోకేష్ పర్యటనకు నో పర్మిషన్
ABN , First Publish Date - 2021-09-09T03:03:41+05:30 IST
నరసరావుపేటలో లోకేష్ పర్యటనకు నో పర్మిషన్
అమరావతి: నరసరావుపేటలో నారా లోకేష్ గురువారం పర్యటించనున్నారు. ఉన్మాది చేతిలో అనూష బలైన విషయం తెలిసిందే. దీంతో అనూష కుటుంబాన్ని లోకేశ్ పరామర్శించనున్నారు. అయితే లోకేష్ పర్యటనకు అనుమతి లేదని పోలీసులు అంటున్నారు. మరోవైపు జిల్లాలో టీడీపీ నేతలను హౌస్ అరెస్టులు చేస్తున్నారు. సత్తెనపల్లిలో టీడీపీ నేత కోడెల శివరాంను హౌస్ అరెస్ట్ చేశారు. నరసరావుపేట పార్లమెంట్ పరిధిలోని గ్రామ స్దాయి నేతలకు పోలీసుల హెచ్చరికలు జారీ చేశారు. లోకేష్ పర్యటనకు వెళ్తే కేసులు పెడతామని హెచ్చరించారు. పోలీసులు తీరుపై టీడీపీ నేత కోడెల శివరాం ఆగ్రహం వ్యక్తం చేశారు.
టీడీపీ నేత నక్కా ఆనందబాబు మాట్లాడుతూ నరసరావుపేట నియోజకవర్గంలో లోకేష్ పర్యటనకు పోలీసులు అనుమతించకపోవడం విచారకరమన్నారు. ‘‘బాధిత కుటుంబాన్ని పరామర్శించడం తప్పా?. ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామో, పోలీసు రాజ్యంలో ఉన్నామో అర్థమవటంలేదు. ప్రజాస్వామ్యయుతంగా చేసే ఆందోళనలను అడ్డుకోవడంలో అర్థంలేదు. టీడీపీ హయాంలో మేమిలా చేసి ఉంటే జగన్ పాదయాత్ర చేయగలిగేవాడా?. వైసీపీ రాబోయే రోజుల్లో ప్రతిపక్ష పాత్ర పోషించక తప్పదు.’’ అని అనందబాబు హెచ్చరించారు.