బేగంపేట రైల్వేస్టేషన్‌లో దిగినపోయిన రఘురామరాజు

ABN , First Publish Date - 2022-07-04T03:53:15+05:30 IST

బేగంపేట రైల్వేస్టేషన్‌లో రఘురామరాజు బృందం రైలు దిగిపోయింది. భీమవరం వెళ్లేందుకు ఆయన ..

బేగంపేట రైల్వేస్టేషన్‌లో దిగినపోయిన రఘురామరాజు

హైదరాబాద్: బేగంపేట రైల్వేస్టేషన్‌లో రఘురామరాజు బృందం రైలు దిగిపోయింది. భీమవరం వెళ్లేందుకు ఆయన లింగంపల్లి వద్ద నర్సాపురం ఎక్స్ ప్రెస్‌ ఎక్కారు. అయితే  బేగంపేట రైల్వేస్టేషన్‌లో  రఘురామరాజు రైలు దిగిపోయారు.  కాగా  భీమవరంలో అల్లూరి సీతారామరాజు పుట్టిన రోజు వేడుకలు  సోమవారం జరగనున్నాయి. ఈ వేడుకలకు ప్రధాని మోదీ వస్తున్నారు. ఈ కార్యక్రమానికి రఘురామరాజు కూడా వెళ్లాలని అనుకున్నారు. ఈ క్రమంలో తన వెహికల్ కు అనుమతివ్వాలని కోరారు.. కాని పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దాంతో తన అనుచరులతో కలిసి లింగంపల్లి రైల్వే స్టేషన్‌లో నర్సాపురం ఎక్స్ ప్రెస్  ఎక్కారు. 


ఇప్పటికే రఘురామతో అనుసరిస్తున్న కొంతమంది నేతలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. అటు  రఘురామకు అనుకూలంగా భీమవరంలో ర్యాలీ చేసిన యువకులను కూడా అదుపులోకి తీసుకున్నారు.  అనుచరులను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక బేగంపేటలో రఘురామరాజు బృందం  దిగిపోయింది. ఆయనతో ఉన్న నేతలు హైదరాబాద్‌లోని రఘురామ ఇంటికి వెళ్లారు. 

Updated Date - 2022-07-04T03:53:15+05:30 IST