పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల ప్రచారానికి యూపీ సీఎం యోగి!

ABN , First Publish Date - 2021-02-25T16:25:40+05:30 IST

దేశంలోని ఐదు రాష్ట్రాల్లో త్వరలో జరగబోయే...

పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల ప్రచారానికి యూపీ సీఎం యోగి!

లక్నో: దేశంలోని ఐదు రాష్ట్రాల్లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఈరోజు ఎంతో కీలకం కానుంది. ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు తమిళనాడు, పుదుచ్చేరిలలో పర్యటించనున్నారు. అలాగే బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా బెంగాల్ పర్యటనలో ఉన్నారు. 


కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈరోజు అసోంలో పర్యటించనున్నారు. కాగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ మార్చి 2న బెంగాల్‌లో పర్యటించనున్నారు. బెంగాల్‌లోని మాల్దాలో యోగి ఆదిత్యనాథ్ ఎన్నికల ప్రచార సభ ఉండనుంది. బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి మాల్దా మంది పట్టువున్న స్థానం. అందుకే బీజేపీ ఇక్కడ ప్రచార ర్యాలీ నిర్వహించాలని భావిస్తోంది. 

Updated Date - 2021-02-25T16:25:40+05:30 IST