స్వర్ణ ప్యాలెస్ ఘటన బాధాకరం
ABN , First Publish Date - 2020-08-10T10:12:16+05:30 IST
విజయవాడ ప్రైవేటు కొవిడ్ సెంటర్ నిర్వహిస్తున్న స్వర్ణ ప్యాలెస్లో అగ్నిప్రమాదం జరిగి 10మంది మృతి చెందడం కలచివేసిందని ..
ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్
పొన్నూరుటౌన్, ఆగస్టు9: విజయవాడ ప్రైవేటు కొవిడ్ సెంటర్ నిర్వహిస్తున్న స్వర్ణ ప్యాలెస్లో అగ్నిప్రమాదం జరిగి 10మంది మృతి చెందడం కలచివేసిందని మాజీ ఎమ్మెల్యే, సంగం డెయిరీ చైర్మన్ ఽధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు సంతాపం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో నిడుబ్రోలుకు చెందిన కొసరాజు సువర్ణలత మృతి చెందటం బాఽధాకరం అన్నారు. ఇలాంటి చర్యలను పునరావృతం కాకుండా ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రమాదంలో గాయపడిన బాధితులకు మెరుగైన వైద్యం అందించాలన్ని ప్రభుత్వాని విజ్ఞప్తి చేశారు.