సీఎం జగన్ మరో కొత్తరాగం: ధూళిపాళ్ల

ABN , First Publish Date - 2022-04-26T01:32:04+05:30 IST

అధికారం ఉందనే అహాంకారం తో ఇలాంటి పాలన ఎప్పుడు చూడలేదని పొన్నూరు మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర అన్నారు.

సీఎం జగన్ మరో కొత్తరాగం: ధూళిపాళ్ల

గుంటూరు: అధికారం ఉందనే అహాంకారంతో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఇలా ప్రవర్తిస్తున్నారని.. చరిత్రలో ఇలాంటి పాలన ఎప్పుడు చూడలేదని పొన్నూరు మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దుష్టచతుర్దయం అంటూ సీఎం జగన్ కొత్తరాగం ఎత్తుకున్నారన్నారు. జగన్‌రెడ్డి , వియసాయి‌రెడ్డి  సుబ్బారెడ్డి , సజ్జల‌రెడ్డిలే ఏపీకి దుష్టచతుర్దయం అన్నారు.ఇంటి చుట్టు ముళ్ల కంచెతో భయంతో ఉండే ఘనుడు జగన్‌రెడ్డి అని ఎద్దేవా చేశారు. తిరుమలలో భక్తులకు నరకం చూపిస్తూ తాడేపల్లిలో సుబ్బారెడ్డి రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు.పదవులు మాత్రమే ఇతర కులాలకు  మంత్రి పదవులు ఇచ్చిన వారికి పవర్ ఉండదని చెప్పారు. గుంటూరు జిల్లాకు చెందిన సుచరిత  హోంమంత్రిగా చేసిన హోంగార్డును కూడా మార్చుకోలేని దుస్థితి వచ్చిందన్నారు. పేరుకు సుచరిత హోంమంత్రి , కానీ పవర్ అంతా సజ్జల వద్దే ఉందన్నారు.భూతుల మంత్రిని తంతే పశువుల పాకలో పడ్డారని సెటైర్లు వేశారు. జగన్ పాలనలో ప్రాణాలకు, మరణాలకు విలువ కడుతున్నారని చెప్పారు. బాపట్లలో పెట్రోల్ బంక్‌లు అన్ని మూసివేయించి ఒక్క డిప్యూటీ స్పీకర్ బంక్ మాత్రమే నడిపారని ధూళిపాళ్ల నరేంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - 2022-04-26T01:32:04+05:30 IST