నారాయణపేటలో ఇంటి వద్దే ధాన్యం కొనుగోలు
ABN , First Publish Date - 2020-04-10T08:06:40+05:30 IST
రైతుల ఇంటి వద్దకే వెళ్లి ధాన్యం కొనుగోలు చేసేందుకు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు నారాయణపేట జిల్లా కలెక్టర్ హరిచందన. ఐకేపీ, మెప్మా, మహిళా...
నారాయణపేట, ఏప్రిల్ 9: రైతుల ఇంటి వద్దకే వెళ్లి ధాన్యం కొనుగోలు చేసేందుకు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు నారాయణపేట జిల్లా కలెక్టర్ హరిచందన. ఐకేపీ, మెప్మా, మహిళా సంఘాల ఆధ్వర్యంలో రైతుల ఇంటివద్దకు వెళ్లి ధాన్యం కొనుగోలుకు కాంటాలు వేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 102 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. కోటకొండలోని రైతు బాలప్ప ఇంటి వద్ద జరుగుతున్న కొనుగోలును కలెక్టర్ హరిచందన గురువారం పరిశీలించారు.