వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలి

ABN , First Publish Date - 2021-01-27T05:54:35+05:30 IST

రైతే రాజని భావిస్తే మూడు వ్యవసాయ చట్టాలను వెంటనే రద్దు చేయాలని నటుడు ఆర్‌.నారాయణమూర్తి డిమాండ్‌ చేశారు.

వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలి
దాచేపల్లిలో మాట్లాడుతున్న పీపుల్స్‌స్టార్‌ ఆర్‌నారాయణమూర్తి

ఆర్‌.నారాయణమూర్తి

వినుకొండటౌన్‌, దాచేపల్లి, జనవరి 26:  రైతే రాజని భావిస్తే మూడు వ్యవసాయ చట్టాలను వెంటనే రద్దు చేయాలని నటుడు ఆర్‌.నారాయణమూర్తి డిమాండ్‌ చేశారు. స్వామినాథన్‌ కమిషన్‌ సూచనల మేరకు పంటకు గిట్టుబాటు ధరలు కల్పించి రైతులను ఆదుకోవాలన్నారు. వినుకొండలో మంగళవారం జరిగిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ యావత్తు భారతదేశం రైతులు చేస్తున్న దీక్షలకు మద్దతు తెలుపుతున్నారని అన్నారు. ఇప్పటికే 40మంది ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో అఖిలభారత కిసాన్‌ రాష్ట్ర అధ్యక్షుడు తోట ఆంజనేయులు, టీడీపీ నాయకుడు రామకోటేశ్వరరావు, సీనియర్‌ న్యాయవాది పి.జె.లూకా, నియోజకవర్గ రైతులు పాల్గొన్నారు. దాచేపల్లి నగర పంచాయతీ నారాయణపురంలో జరిగిన రైతు శంఖారావ సభలో నారాయణమూర్తి పాల్గొన్నారు. అన్ని రాజకీయపార్టీలు జెండాలను పక్కనపెట్టి రైతులకు సంపూర్ణ మద్దతునివ్వాలని కోరారు. 

Updated Date - 2021-01-27T05:54:35+05:30 IST