నారాయణ కుమార్తెలు, అల్లుడికి ముందస్తు బెయిల్పై హైకోర్టులో విచారణ
ABN , First Publish Date - 2022-05-18T22:00:24+05:30 IST
మాజీమంత్రి నారాయణ కుమార్తెలు, అల్లుడికి ముందస్తు బెయిల్పై హైకోర్టులో విచారణ జరిగింది.
అమరావతి: మాజీమంత్రి నారాయణ కుమార్తెలు, అల్లుడికి ముందస్తు బెయిల్పై హైకోర్టులో విచారణ జరిగింది. పేపర్ లీక్ కేసులో శరణి, సిందూర, పునీత్ హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. తొందరపాటు చర్యలు తీసుకోవద్దని ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. ప్రభుత్వం తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపించారు. ఉత్తర్వుల కోసం విచారణను గురువారానికి హైకోర్టు వాయిదా వేసింది.