కమ్యూనిస్టు కంచు కంఠం మాయమైంది: నారాయణ
ABN , First Publish Date - 2022-03-20T15:59:24+05:30 IST
కమ్యూనిస్టు కంచు కంఠం మాయమైందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు.
హైదరాబాద్: నిజాంకు, పెట్టుబడిదారీ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తి మల్లు స్వరాజ్యమని, కమ్యూనిస్టు కంచు కంఠం మాయమైందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ కమ్యూనిస్టు ఉద్యమానికి చివరిదశ నాయకురాలు మల్లు స్వరాజ్యం అని, ఆమె స్పూర్తితో కమ్యూనిస్టు ఉద్యమాన్ని ఐక్యపరిచి ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని నారాయణ వ్యాఖ్యానించారు.
అనారోగ్యం, వయసు రీత్యా ఎదురయ్యే సమస్యలతో తీవ్ర అస్వస్థతకు గురికావడంతో మల్లు స్వరాజ్యంను ఈ నెల 1న హైదరాబాద్ బంజారాహిల్స్ కేర్ ఆస్పత్రిలో చేర్చారు. కొద్ది రోజుల చికిత్స తర్వాత ఆరోగ్యం మెరుగుపడడంతో.. ఐసీయూ నుంచి సాధారణ గదికి మార్చారు. శుక్రవారం ఆరోగ్యం క్షీణించడంతో మళ్లీ ఐసీయూకు తరలించి వెంటిలేటర్పై ఉంచారు. శనివారం రాత్రి 7.35కు స్వరాజ్యం చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు.