వెలిమెల నారాయణ క్యాంపస్లో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
ABN , First Publish Date - 2020-02-25T22:00:20+05:30 IST
వెలిమెల నారాయణ క్యాంపస్లో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
సంగారెడ్డి: నారాయణ క్యాంపస్లో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. రామచంద్రాపురం మండలం వెలిమెలలో నారాయణ క్యాంపస్లో ఈ ఘటన జరిగింది. హాస్టల్ బాత్రూమ్లో ఉరేసుకుని విద్యార్థిని సంధ్యారాణి ఆత్మహత్య చేసుకుంది. సంధ్యారాణి స్వస్థలం మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం మల్లెబోయినపల్లిగా గుర్తించారు.