పుంతల ముసలమ్మ అమ్మవారికి సారె
ABN , First Publish Date - 2021-04-17T05:27:27+05:30 IST
రాయపేటలో పుంతల ముసలమ్మ అమ్మవారి జాతర ఆరోవ రోజు ఘనంగా జరిగింది.
నరసాపురం టౌన్; ఏప్రిల్ 16: రాయపేటలో పుంతల ముసలమ్మ అమ్మవారి జాతర ఆరోవ రోజు ఘనంగా జరిగింది. సంప్రదాయం ప్రకారం అమ్మవారికి సారెను సమర్పించారు. శుక్రవారం కావడంతో మహిళలు పెద్ద సంఖ్యలో విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ ఆధ్యక్షుడు తమ్మిశెట్టి బాబ్జీ, దేవరపు సుబ్బా రావు, తాడి రాఽధాకృష్ణ, జానకి తదితరులు పాల్గొన్నారు.