నరసాపురంలో ఆ..ఆరుగురికి నెగిటివ్
ABN , First Publish Date - 2020-04-03T11:52:15+05:30 IST
నరసాపురం పట్టణంలో ఒక ప్రాంతానికి చెందిన ఆరుగురు ఢిల్లీ అధ్యాత్మిక కార్యక్రమాలకు హాజరయ్యారు.
ఊపిరి పీల్చుకున్న అధికారులు..ప్రజలు
నరసాపురం, ఏప్రిల్ 2: నరసాపురం పట్టణంలో ఒక ప్రాంతానికి చెందిన ఆరుగురు ఢిల్లీ అధ్యాత్మిక కార్యక్రమాలకు హాజరయ్యారు. మూడు రోజుల క్రితం వీరిని పాలకొల్లు క్వారంటైన్కు తరలించారు. అక్కడి నుంచి పరీక్షల కోసం ఏలూరు తరలించారు. దీంతో పోలీసులు ముందస్తు చర్యల్లో భాగంగా ఆ ఏరియాలో రెడ్జోన్ ఏర్పాట్లు చేశారు. టీమ్లను కూడా సిద్ధం చేశారు. ఈ హడావుడి చూసి ప్రజల్లో భయాందోళన నెలకొంది. గురువారం రాత్రి వచ్చిన రిపోర్టులో వీరికి నెగెటివ్ రావడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. విషయం తెలిసిన ప్రజలు కూడా హమ్మయ్య అని తేలికపడ్డారు.