దళితులపై మీ దమనకాండ ఆపరా?: నారా లోకేశ్

ABN , First Publish Date - 2020-09-28T02:49:16+05:30 IST

చిత్తూరు జిల్లాలో జడ్జి రామకృష్ణ తమ్ముడు రామచంద్రపై దుండగులు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే...

దళితులపై మీ దమనకాండ ఆపరా?: నారా లోకేశ్

అమరావతి: చిత్తూరు జిల్లాలో జడ్జి రామకృష్ణ తమ్ముడు రామచంద్రపై దుండగులు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ దాడిని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ ఖండించారు. ఏపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఎంత మంది దళిత బిడ్డలను బలితీసుకుంటారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ చెత్త పాలనలో దళితులకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తే చంపేస్తారా?, దళితులపై మీ దమనకాండ ఆపరా? అని ప్రశ్నించారు. జడ్జి రామకృష్ణ కుటుంబాన్ని వెంటాడి వేధిస్తున్న వైసీపీ నేతలను, దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని నారా లోకేశ్ డిమాండ్ చేశారు. 

Updated Date - 2020-09-28T02:49:16+05:30 IST