టీడీపీ కుటుంబంలో మనస్పర్ధలు వస్తాయి.. పోతాయి: లోకేష్
ABN , First Publish Date - 2021-03-09T00:17:47+05:30 IST
రాష్ట్రంలో దరిద్రపు పాదం ఉందని ప్రజలు భావిస్తున్నారని తెలుగుదేశం జాతీయ కార్యదర్శి నారా లోకేష్ వ్యాఖ్యానించారు.
విజయవాడ: రాష్ట్రంలో దరిద్రపు పాదం ఉందని ప్రజలు భావిస్తున్నారని తెలుగుదేశం జాతీయ కార్యదర్శి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. సోమవారం ఏబీఎన్తో లోకేష్ మాట్లాడుతూ.. అన్నివర్గాలపై పన్ను భారం మోపేందుకు వైసీపీ సర్కార్ చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఎన్నికల్లో పోటీ చేసే టీడీపీ అభ్యర్థులను వైసీపీ నేతలు పలు రకాలుగా ఇబ్బందులకు గురిచేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో 21 నెలల పాలనలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని మండిపడ్డారు. ప్రజల్లో వైసీపీ పట్ల తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. టీడీపీ కుటుంబంలో చిన్న చిన్న మనస్పర్ధలు వస్తాయి.. పోతాయని చెప్పారు. విజయవాడ ఘటన కూడా అలాంటిదేనని తెలిపారు. కేవలం మూడు గంటల్లోనే తమ కుటుంబ విషయాన్ని పరిష్కరించుకున్నామన్నారు. టీడీపీ అధికారంలోకి రావాలన్న భావన ప్రజల్లో నాటుకుపోయి ఉందని లోకేష్ పేర్కొన్నారు.