నాపై వైసీపీ కుక్కలు రాళ్లు వేశారు: లోకేష్

ABN , First Publish Date - 2022-04-29T00:58:36+05:30 IST

తిరుపతమ్మ మృతదేహానికి టీడీపీ నేత నారా లోకేష్‌ నివాళులర్పించారు. హత్యాచార బాధితురాలి కుటుంబాన్ని ఆయన పరామర్శించారు.

నాపై వైసీపీ కుక్కలు రాళ్లు వేశారు: లోకేష్

గుంటూరు: తిరుపతమ్మ మృతదేహానికి టీడీపీ నేత నారా లోకేష్‌ నివాళులర్పించారు. హత్యాచార బాధితురాలి కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. బాధిత కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థికసాయం అందజేస్తామని ఈ సందర్భంగా వెల్లడించారు. బాధిత కుటుంబానికి టీడీపీ అండగా ఉంటుందన్నారు. ఏపీలో రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తున్నారని మండిపడ్డారు. బాధితుల పరామర్శకు వచ్చిన తనపై వైసీపీ కుక్కలు రాళ్లు వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై రాళ్లు విసురుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారు? అని ప్రశ్నించారు. వైసీపీ కుక్కల దాడులకు టీడీపీ నేతలు భయపడే ప్రసక్తే లేదన్నారు. తమది ఎల్లో బ్లడ్‌..ఎవరికీ భయపడేది లేదన్నారు. తమది పేటీఎం బ్యాచ్‌ కాదన్నారు. దిశా చట్టం ప్రకారం నిందితులకు 21 రోజుల్లో ఉరిశిక్ష వేస్తారా? అని ప్రశ్నించారు. బాధితులకు 21 రోజుల్లో న్యాయం జరగకపోతే మళ్లీ వస్తానని స్పష్టం చేశారు. 

Updated Date - 2022-04-29T00:58:36+05:30 IST