ఛాలెంజ్ .. అలిపిరి గరుడ సర్కిల్‌కు చేరుకున్న లోకేశ్

ABN , First Publish Date - 2021-04-14T16:23:38+05:30 IST

మరికాసేపట్లో గరుడ సర్కిల్ దగ్గర లోకేశ్ ప్రమాణం చేయనున్నారు. వివేకానంద రెడ్డి హత్యతో తమకు సంబంధం లేదని ప్రమాణం చేస్తామని గతంలో లోకేశ్ ప్రకటించిన విషయం తెలిసిందే.

ఛాలెంజ్ .. అలిపిరి గరుడ సర్కిల్‌కు చేరుకున్న లోకేశ్

తిరుపతి: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అలిపిరి సర్కిల్‌కు చేరుకున్నారు. మరికాసేపట్లో గరుడ సర్కిల్ దగ్గర లోకేశ్ ప్రమాణం చేయనున్నారు. వివేకానంద రెడ్డి హత్యతో తమకు సంబంధం లేదని ప్రమాణం చేస్తామని గతంలో లోకేశ్ ప్రకటించిన విషయం తెలిసిందే. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు. అయితే ఇప్పటి వరకు సీఎం జగన్ నుంచి, వైసీపీ వర్గాల నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. తన ఛాలెంజ్ ప్రకారం లోకేశ్ ప్రమాణానికి రెడీ అయ్యారు. నారా లోకేశ్‌తో పాటు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు ఇతర నేతలు ఉన్నారు.

Updated Date - 2021-04-14T16:23:38+05:30 IST