జగన్‌కు నారా లోకేష్‌ లేఖ

ABN , First Publish Date - 2020-05-23T20:31:10+05:30 IST

సీఎం జగన్‌కు టీడీపీ నేత నారా లోకేష్‌ లేఖ రాశారు. అంగన్‌వాడీ వర్కర్లకు బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. కరోనా సమయంలో జీవితాలను ఫణంగా పెట్టి ప్రజలకు సేవలందిస్తున్నారని

జగన్‌కు నారా లోకేష్‌ లేఖ

అమరావతి: సీఎం జగన్‌కు టీడీపీ నేత నారా లోకేష్‌ లేఖ రాశారు. అంగన్‌వాడీ వర్కర్లకు బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. కరోనా సమయంలో జీవితాలను ఫణంగా పెట్టి ప్రజలకు సేవలందిస్తున్నారని, అంగన్‌వాడీ వర్కర్లకు ఇంటింటికీ వెళ్లి చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ప్రధాని గరీబ్‌ కల్యాణ్‌ ప్యాకేజీ కింద హెల్త్‌కేర్‌ వర్కర్లకు బీమా అందిస్తున్నారని, ఈ జాబితాలో అంగన్‌వాడీ వర్కర్లు లేకపోవడం బాధాకరమని చెప్పారు. ప్రభుత్వం చొరవ తీసుకొని అంగన్‌వాడీ వర్కర్లకు రూ.50లక్షల బీమా అందేలా చూడాలని లేఖలో లోకేష్‌ కోరారు.

Updated Date - 2020-05-23T20:31:10+05:30 IST