ఇవాళ కర్నూలు జిల్లాలో Nara Lokesh పర్యటన
ABN , First Publish Date - 2021-08-17T13:26:26+05:30 IST
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ జిల్లాల బాట పట్టారు.
కర్నూలు : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ జిల్లాల బాట పట్టారు. నిన్న గుంటూరు జిల్లాలో పర్యటించిన లోకేశ్ ఇవాళ.. కర్నూలు జిల్లాకు వెళ్తున్నారు. ఏడాది క్రితం హత్యకు గురైన గోనెగండ్ల మండలం ఎర్రబాడు యువతి కుటుంబాన్ని అఖిలపక్ష నేతలతో కలిసి ఆయన పరామర్శించనున్నారు. ఉదయం 10 గంటలకు కర్నూలు విమానాశ్రయానికి చేరుకుంటారు. రోడ్డు మార్గం ద్వారా ఉదయం 11:15 గంటలకు కోడుమూరుకు చేరుకుని అఖిలపక్ష సమావేశం నిర్వహించి తర్వాత ఎర్రబాడు గ్రామానికి వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తారు. ఆ తర్వాత మీడియా మీట్ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. అనంతరం సాయంత్రం 4:40 గంటలకు హైదరాబాద్కు తిరుగుపయనమవుతారు.