మానవత్వం చాటుకున్న నారా లోకేష్
ABN , First Publish Date - 2021-08-27T22:53:46+05:30 IST
జిల్లా పర్యటనలో నారా లోకేష్ మానవత్వం చాటుకున్నారు. బళ్లారి చౌరస్తా వద్ద మైనార్టీ నేత అమీద్ బాషా, లోకేష్ను
కర్నూలు: జిల్లా పర్యటనలో నారా లోకేష్ మానవత్వం చాటుకున్నారు. బళ్లారి చౌరస్తా వద్ద మైనార్టీ నేత అమీద్ బాషా, లోకేష్ను కలిసి సాయం కోరారు. తన కష్టాలు, ఆర్ధిక ఇబ్బందులను లోకేష్కు బాషా చెప్పారు. తక్షణమే బాషాకు లోకేష్ 25 వేల రూపాయలు ఆర్ధిక సాయం చేశారు. అంతేకాదు అధైర్యపడొద్దని తాను అండగా ఉంటానని లోకేష్ హామీ ఇచ్చారు.