నెక్స్ట్ ఏంటి.. రౌడీషీటేనా?: నారా లోకేష్

ABN , First Publish Date - 2022-04-19T00:20:36+05:30 IST

ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి, వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

నెక్స్ట్ ఏంటి.. రౌడీషీటేనా?: నారా లోకేష్

అమరావతి : ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి, వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం లోకేష్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘జగన్‌రెడ్డి... ఇంత పిరికివాడివేంటి.. ప్రశ్నిస్తే కేసు పెడతానంటే ప్రశ్నిస్తూనే ఉంటా. హత్యాయత్నంతో పాటు 11 కేసులు పెట్టావ్. ఇప్పుడు కల్యాణదుర్గంలో మరో కేసు. నీలా ప్రజల సొమ్ము దొబ్బినందుకు నాపై కేసుల్లేవు. ప్రజల పక్షాన నిలబడినందుకు మాత్రమే నాపై కేసులు ఉన్నాయి. మంత్రి పర్యటన సందర్భంగా పోలీసులు ఓవర్ యాక్షన్ చేసి దళిత చిన్నారిని బలిగొన్నారు. చిన్నారి కుటుంబానికి న్యాయం చేయమని అడిగిన నాపై కేసు పెట్టారు. బడుగు, బలహీన వర్గాల పక్షాన నిలబడినందుకు 12 కేసులు పెట్టావ్...నెక్స్ట్ ఏంటి? రౌడీషీట్ ఓపెన్ చేస్తావా? దేనికైనా రెడీ అని’’ సీఎం జగన్ తీరుపై లోకేష్ ధ్వజమెత్తారు.

Updated Date - 2022-04-19T00:20:36+05:30 IST